Home » Cricket
టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. గత వరల్డ్ కప్ సమయంలో హార్దిక్ గాయపడినపుడు.. నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారని గుర్తుచేశాడు.
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.
వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్లో టీ20 సిరీస్లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్కే మొగ్గుచూపే అవకాశముంది.
భారత జట్టు గురువారం నుంచి జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముందు భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. జట్టుకు ధైర్యం చెప్పాడు. బయట విమర్శలను పట్టించుకోకుండా.. వైఫల్యాలకు భయపడకుండా ఆడితేనే ఉత్తమ ప్రదర్శన చేయాలని సూచించాడు.
భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ కౌంటీ క్లబ్ యార్క్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫిట్నెస్పై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో గిల్ బ్యాటింగ్తో అదరగొట్టినప్పటికీ.. కీలక సమయంలో కండరాలు పట్టేయడంపై ప్రశ్నలు లేవనెత్తాడు.
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత్కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కేసులో లలిత్ మోదీకి అప్పిలేట్ ట్రైబ్యూనల్ అనుకూలంగా తీర్చునిచ్చింది.
భారత జట్టును కొంతకాలంగా గాయాల బెడద వెంటాడుతోంది. ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ విషయంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), జట్టు యాజమాన్యం, సపోర్ట్ స్టాఫ్ మధ్య సరైన సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.
భారత టీ20 జట్టులో చోటు దక్కడంతో తన జీవితకాల కల నెరవేరిందని యువ పేసర్ అశోక్ శర్మ వెల్లడించాడు. జులై 23 నుంచి 26 వరకు టీమిండియా.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.
వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం భారత బ్యాటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్(801) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.