Home » Cricket news
విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ టోర్నీలో టీమిండియా వెటరన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడే విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టి పారేశాడు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని సంజయ్ స్పష్టం చేశాడు.
చిన్న దేశాలు నిర్వహించే క్రికెట్ లీగ్స్ లో స్టార్ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. అలానే తాజాగా నేపాల్ ప్రీమియర్ లీగ్(NPL)లోకి భారత్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ లీగ్లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ క్రికెటర్ అయిన ప్రియాంక్ పంచల్ కూడా ఎన్పీఎల్ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ముంబైలో జరిగిన ఎస్ఏ20 ఇండియా డే కార్యక్రమంలో భారత్తో సిరీస్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ శత్రువుగా చమత్కరించాడు.
గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోం గ్రౌండ్ను చిన్నస్వామి స్టేడియం నుంచి మహారాష్ట్రకు మారుస్తున్నట్లు సమాచారం.
గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు విదేశీయులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు.
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ వేలం ఎప్పుడు ఎక్కడ జరిగేదీ ఖరారైపోయింది. ఈసారి కూడా వేలాన్ని విదేశాల్లో నిర్వహించనున్నారు. మరి వేలం ఏ దేశంలో, ఎప్పుడు నిర్వహిస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.
తాజాగా ముంబైలో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంటున్న ఓ కొత్త జంటకు రోహిత్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ వధూవరుల హృదయాలను గెలుచుకున్నాడు
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి... రాజేంద్రనగర్ హనుమాన్నగర్కు చెందిన దుగ్గన్న కుమారుడు ధనూష్(22) మానస హిల్స్లోని ప్రెస్టీజ్ నిర్వణలో పనిచేస్తున్నాడు.
తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని దేశ ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు భారత మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో విండీస్ విజయం సాధించింది. తరువాత రెండు వరుస మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఇక ఇవాళ జరిగిన నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.