Home » Congress
బీఆర్ఎస్లో కాలేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాజీ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో హరీశ్ మానసిక స్థితి సరిగా లేదన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విందు ఇవ్వడంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయపరంగా కాకుండా పరిపాలనా అవసరాల దృష్ట్యా జరిగిందని ఆయన తెలిపారు. అనవసరంగా ట్రోల్ చేయవద్దని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ అంశంపై బీజేపీ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.
భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఫామ్హౌస్కు తాను ఏనాడూ పోలేదని స్పష్టం చేశారు.
పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు.
నియోజకవర్గాల పునర్విభన బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ ప్రజలను ఏకం చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లును పెట్టి మహిళా బిల్లుగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటోందని ఎంపీ అన్నారు.
రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నాయకుడు రేవంత్ అని అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి, పేదలకు అన్నం లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని.. పేదల సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు.