Home » Congress Govt
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్రెడ్డి సర్కార్ విఫలమైందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెంట్రింగ్ కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మాజీమంత్రి హరీశ్రావుపై.. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ హరీశ్రావు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. పంజాబ్ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులతో సమాన ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు.
సర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికి ఒక్క ఓటు ఒక్క దగ్గర మాత్రమే ఉండాలని చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్తో త్రీ ట్రిలియన్ ఎకానమీ కోసం తాము పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.