Home » Congress Govt
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని కేబినెట్ తీర్మానం చేసింది. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఉండటంతో ఆశావాహులు పోటీ నుంచి వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో ఈ నిర్ణయంపై కేబినెట్ ఇవాళ పునారాలోచన చేసింది. ఈ నేపథ్యంలో మంత్రుల అభిప్రాయం మేరకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మీనాక్షి నటరాజన్ని ఇవాళ తాను కలిశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తాను చెప్పాల్సింది చెప్పానని అన్నారు. జరుగుతున్న విషయాలను కాంగ్రెస్ పెద్దలతో చెప్పానని కొండా సురేఖ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(గురువారం) మంత్రి మండలి సమావేశం ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్తో సీఎం రేవంత్రెడ్డి చర్చించారు.
అయితే ఇప్పటికే తన ఇంటికి పోలీసులు రావడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ మహిళ మంత్రి ఇంటికి పోలీసులను పంపి అవమానించారని ఆమె మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకి అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్లో ఆస్బయోటెక్ ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్లో కీలకోపన్యాసం చేయనున్నారు మంత్రి శ్రీధర్బాబు.
మంత్రుల మధ్య వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మధ్య వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాను సీన్సియర్ కాంగ్రెస్ వాదినని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బిహార్లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్రావు ప్రశ్నించారు.
హైదరాబాద్కు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆరోపించారు.
కవిత చేపట్టబోయే యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించికున్నట్లు సమాచారం.
ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.