Home » Congress Govt
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతోపాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాయచూరు, దేవదుర్గ ప్రాంతాల్లో కాపర్ అండ్ గోల్డ్ మైనింగ్ యాక్షన్లో సింగరేణి పాల్గొందని చెప్పుకొచ్చారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇవ్వనని.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు.
గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్రెడ్డి.
మెదక్ పట్టణంతో పాటు రాజీపల్లిలో 9.5, పాతూరు 8.1 సెం. మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష చేయనున్నారు.
42శాతం బీసీ రిజర్వేషన్లతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. కామారెడ్డి బీసీ విజయోత్సవ బహిరంగ సభ విజయవంతం కోసం జనసమీకరణ ఏర్పాట్లపై చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని, చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కమిటీల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని, ఒక్కో కమిటీ రిపోర్ట్ వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మొన్నటి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేస్తే కేవలం రెండు రోజులు మాత్రమే పెట్టి సీఎం రేవంత్రెడ్డి పారిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.