Home » CM Stalin
తమిళనాడులో ద్విభాషా విద్యా విధానాన్నే కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. స్పోకెన్ ఇంగ్లీష్ తరహాలో స్పోకెన్ తమిళంపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాల్లో సీఎం ఫోటోలను ఉపయోగించే విధాన్ని దేశమంతా అనుసరిస్తోందని, పిటిషనర్కు నిజంగానే అంత ఆందోళన ఉంటే ఒక పార్టీనే ఉద్దేశించి కాకుండా అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాలు చేయలేదని సుప్రీంకోర్టు నిలదీసింది.
డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) గురువారం రెండుసార్లు కలుసుకుని రాజకీయ కలకలం సృష్టించారు. ఉదయం అడయార్ కళాక్షేత్ర ప్రాంతంలో స్టాలిన్ వాకింగ్కు వెళ్తుండగా ఓపీఎస్ తారసపడ్డారు. ఇద్దరూ ఐదు నిమిషాలపాటు ఆప్యాయంగా పలుకరించుకున్నారు.
అస్వస్థత కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆంజియోగ్రామ్ తర్వాత ఆయన కోలుకుంటున్నట్లు వైద్యనిపుణులు వెల్లడించారు. గత సోమవారం ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన స్టాలిన్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ఆంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అందులో గుండె పనితీరుకు సంబంధించిన ఫలితాలు అన్నీ సవ్యంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 21న స్టాలిన్ వాకింగ్ చేస్తున్నప్పుడు స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో గత నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్న ప్రజావ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని మరో 9 నెలల్లో ప్రజలే ఇంటికి సాగనంపుతారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈ నెల 7వ తేదీన ప్రారంభించిన తొలి ప్రచారయాత్ర బుధవారం తంజావూరు జిల్లా వరత్తనాడులో ముగిసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యేళ్లతరబడి భాష, విద్య, నిధుల విషయంలో అనుసరిస్తున్న నిర్ల్యక్ష వైఖరిని ఖండిస్తూ ఉభయ సభల్లో గళమెత్తాలని డీఎంకే ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తేనాంపేటలోని అన్నా అరివాలయంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజర్పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడి అనవసరమైన వివాదాలను సృష్టించవద్దంటూ పార్టీ శ్రేణులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్టాలిన్ తన ఎక్స్పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకే కేంద్రంలోని బీజేపీ పాలకులు తమిళగవెట్రి కళగంకు మద్దతునిస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు విజయ్ తల్లి క్రైస్తవురాలు కావడంతో, ఆ ఓట్లను చీల్చవచ్చునని కలలు కంటున్నారని స్పీకర్ అప్పావు విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘ఉంగలుడన్ స్టాలిన్’ పేరుతో ప్రారంభమైన ప్రజావిజ్ఞప్తుల శిబిరాలకు వస్తున్న జనాలను చూసి ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామికి వణకుపుట్టి, విమర్శల పేరుతో డీఎంకే ద్రావిడ తరహా పాలనకు విస్తృత ప్రచారం చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎద్దేవా చేశారు.