Home » CM Chandrababu Naidu
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.
పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేనని వ్యాఖ్యానించారు.
గాదె సాయికృష్ణ అదృశ్యం నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు.
యోగా సాధనతో బాబారామ్దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని చెప్పుకొచ్చారు.
విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.