Home » CM Chandrababu Naidu
ఏపీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్లో సంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష విద్య సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటూ.. వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులని ప్రభుత్వం కల్పిస్తూ మీ భూమి - మీ హక్కు కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
జగన్ హయాంలో వేధింపులు, కక్ష సాధింపులతో పాలన పతనావస్థకు చేరిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తుందని వెల్లడించారు.
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరిగాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు.
పాసు పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఆయా జిల్లాల వారీగా పాస్ పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది.
కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రం చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని.. సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెట్టారని చెప్పారు.
చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన కూటమి ప్రభుతానికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తితే.. ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.
ఏపీ మంత్రి మండలి సమావేశం జనవరి 8న జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అబివృద్ధిలో చంద్రబాబు ప్రస్తావన లేకుండా చరిత్ర లేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎంత కోపం ఉన్నా.. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ముఖంలో కనిపించకుండా పని చేసే ఏకైక నేత చంద్రబాబు అని కొనియాడారు.