Home » CM Chandrababu Naidu
గూగుల్ ఏఐ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు.
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యూనిట్ ధరను రూ.4.60కు తగ్గించేలా కసరత్తు చేస్తోంది. సోమవారం నాడు విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు.
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.
కువైట్లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఎన్నో సంవత్సరాలుగా చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ -2025' ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబును కొనియాడుతూ పవన్ కల్యాణ్ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముంబైలో జరిగిన కార్యక్రమంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును ది ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు.
ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి జాతీయ గుర్తింపు లభించింది. సాంకేతికత వినియోగంలో విశిష్టతకు గానూ ప్రతిష్ఠాత్మక పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్ దక్కింది.