Home » Chittoor
రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్నాయి. వివిధ మార్గాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం సింగిల్ విండో సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీని ప్రభావంతో రైతులకు రూ.200 కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణ పంపిణీ ఆగిపోయింది.
పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.
అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్కిరణ్ తోమాల. అమెరికాలోని టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్. ఈమెది టెక్సాస్. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.
న్యూటన్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.
కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
రేణిగుంటలో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
‘లోకేశ్ సర్..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు వాట్సాప్ ద్వారా లేఖ రాసింది.
శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.