Home » Chennai News
అడవిలో నుంచి వచ్చిన ఏనుగు, ఆ ప్రాంతంలోని ఆలయం ముందు నిలబడి తొండెం ఎత్తి కొద్దిసేపు ఉండి వెళ్లే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల శరణాలయంలో చిరుతలు, ఏనుగులు సహా పలురకాల జంతువులున్నాయి.
తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సముద్రతీర రహదారిలో మంగళవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యవిద్యార్థులు మృతి చెందారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఓ కారులో వెళ్తుండగా ఉన్నట్టుండి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును డీకొంది.
చెన్నై నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి బూత్లోనూ అడ్రస్ మారిన ఓటర్లు 300 మంది వరకు ఉన్నారని గుర్తించడంతో సవరణ పనుల్లో తీవ్ర చిక్కులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు.
తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా రామేశ్వరంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్లస్-2 చదువుతున్న బాలికను ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేయగా, ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కార్యకర్తలకు క్యూ ఆర్ కోడ్తో ఉన్న గుర్తింపు కార్టులను అందజేయాలని ఆ పార్టీ నాయత్వం నిర్ణయించింది. ఈమేరకు 1,02,103 మందికి క్యూ ఆర్ కోడ్తో కూడిన గుర్తింపు కార్డులను జిల్లా నేతలకు అందజేశారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.
ఆమెకు వివాహం జరిగి కేవలం రెండున్నర నెలలో అయినా.. 8 నెలల గర్భం ఉండడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. తమకు పెళ్లి జరిగి కేవలం రెండున్నర నెలలే అవుతోందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. రామనాథపురం జిల్లా పాంబన్ ఉత్తర తీరం నుంచి మన్నార్ గల్ఫ్ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్ ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.