Home » Chennai News
సంక్రాంతి పండుగ వల్ల ప్రయాణికులు లేకపోవడంతో ఐదు ప్రత్యేక రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాల నుంచి పెద్దఎత్తున తమతమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో చెన్నై మహానగరం ఖాళీ అయిపోయింది.
అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 23వతేదీన తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని పర్యటనను తొలుత మదురై పట్టణంలో ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించగా.. దానిని రాజధాని చెన్నైకి మార్చారు. వివరాలిలా ఉన్నాయి.
చెన్నై మహానగరంలో.. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు గతంలో నగరంలో అందుబాటులో ఉండేవి. అయితే.. మళ్లీ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి మళ్లీ వీటిని సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఎస్పైకి అన్నీతానై పెంచిన పినతల్లి మృతిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటానంటూ.. వైద్య విద్యార్థినిని అనడంతో సవతి తల్లి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. హర్షిణి (22) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని వేలాంకన్నికి వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వేలాంకన్ని ఆరోగ్యమాత ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. అయితే.. వీరి సౌకర్యార్థం హెలికాప్టర్ను ఏర్పాటుచేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 9వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆ ఏరియాలో చిరుతపులి సంచారం ఉందని, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు తెలుపుతున్నారు. కడలూరు సమీపం అరిసిపెరియంకుప్పం ప్రాంతంలో నయినార్ అనే రైతుకు చెందిన పొలంలో చిరుత కాలిముద్రలను గుర్తించారు.
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్లో వాహనాల ప్రవేశ రుసుమును రాష్ట్రప్రభుత్వం పెంచింది. బస్సులకు ప్రవేశ రుసుము రూ.250 వసూలుచేస్తుండగా రూ.300లకు పెరిగింది. అలాగే మిగిలిన వాహనాలకు కూడా పెంచారు.