Home » Chennai News
కండక్టర్పై లా విద్యార్థిని చెప్పుతో దాడి చేసిన సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. దీనిపై రవాణా శాఖ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తరాది వారికి తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించడమేంటని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రశ్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు
డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని ఆపార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కరూర్ లో హీరో, టీవీకే పార్టీ నేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ సభలకు ముందస్తు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి రైతు కాదు... ద్రోహి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. మరొకొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాదిన ఉన్న జిల్లాలను వర్షం ముంచెత్తింది. అలాగే.. తంజావూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 22 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి, అరటి తోటలు నీట మునిగాయి. వివరాలిలా ఉన్నాయి.
తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని ఎట్టకేలకు తాను నెరవేర్చానని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోయంబత్తూరులో సెమ్మొళి పూంగాను నిర్మిస్తానంటూ కరుణానిధి హామీని ఇప్పుడు నెరవేర్చానన్నారు.
29న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో చెన్నై సహా 11 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశ: ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రప్రజలను, ముఖ్యంగా సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేసింది.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సంచలన కామెంట్స్ చేశారు. చెన్నై మినహా ఇతర నగరాలకు మెట్రోరైలు సర్వీసులు అవసరమా.. అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. ఆయన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పులి దాడిలో ఓ వృద్ధురాలిని చంపేసిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లలో చోటుచేసుకుంది. నాగియమ్మాళ్ అనే వృద్ధురాలు పులి దాడిలో మృతిచెందడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.