Home » Chennai News
తమిళ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నివాసంలో గుర్తు తెలియని అగంతకుడు చొరబడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన ‘వై’ కేటగిరీ భద్రత కలిగిన విజయ్ నివాసంలో ఆ అగంతకుడు ఎలా ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తిరునల్వేలిలో బుధవారం రాత్రి మద్యం మత్తులో బైకుపై వెళుతున్న యువకుడిని కారుతో ఢీకొట్టిన ట్రాఫిక్ విభాగం ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. తూత్తుకుడి జిల్లా కయిత్తారుకు చెంందిన గాంధీరాజన్ (59) తిరునల్వేలిలో ట్రాఫిక్ విభాగం ఎస్గా పనిచేస్తున్నారు.
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 69వ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీ జరుగనుంది. తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో జరిగే ఈ సమావేశానికి ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు పూచ్చి మురుగన్, కరుణాస్, నడిగర్ సంఘ కార్యవర్గం, సర్వసభ్య సభ్యుల సహా 3 వేల మంది హాజరుకానున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేలా ప్రచారం కూడా చేపట్టాలని ‘మక్కల్ నీదిమయ్యం’ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలుసుకుని కారులో తిరిగి వెళుతూ తాను ముఖం చాటేశానంటూ వస్తున్న విమర్శల్ని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొట్టిపారేశారు. చెమటపడితే రుమాలుతో తుడుచుకుంటూ వెళ్లానని, దానిపై ప్రసార మాధ్యమాలకు తోడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రహ్మకమలం అనే పువ్వు 12యేళ్లకు ఒకసారి మాత్రమే వికిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందిన నీలంరంగు కురిం జి పుష్పం పుష్కర కాలం తరువాత ప్రస్తుతం నీలగిరి, కొడైకెనాల్ పశ్చిమ కనుమల్లో విరబూసింది.
తన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యేవారని బీజేపీ నేత శరత్కుమార్ వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ప్రచారానికి లక్షలాది మంది తరలిరావడంపై పలు పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
జెండా స్తంభాల తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మద్రాసు హైకోర్టు ప్రశంసించింది. రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, ప్రైవేటు స్థలాల్లో రాజకీయ పార్టీలు, మత, కుల సంఘాలు ఏర్పాటుచేసిన జెండా స్తంభాలు తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం జనవరిలో ఉత్తర్వులు జారీచేసిన విషం తెలిసిందే.
పెరంబలూరు జిల్లా గోల్కానత్తం ప్రాథమిక కేంద్రానికి సాధారణ రోగి వేషంలో వెళ్లిన జిల్లా కలెక్టర్ మృణాళిని అక్కడ ప్రజలకు ఏవిధంగా వైద్యం అందుతుందో పరిశీలించారు. ఇటీవల గోల్కానత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కు.ని శస్త్రచికిత్స చేయించుకున్న ఓ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స సరిగ్గా లేదంటూ జిల్లా కలెక్టర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.