Home » Chennai News
శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
హీరో విశాల్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో గత కొంతకాలంగా సాగుతోంది.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు.
తెలియని వారికి ఎస్ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ తన జన్మదినం సందర్భంగా టీటీడీలో ఒక రోజు అన్నదానం కోసం రూ.44 లక్షలు కేఎన్ నెహ్రూ విరాళంగా అందజేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రేషన్కార్డు దారులకు పొంగల్ కానుకగా రూ. 5వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు.
గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్ ధ్వజమెత్తారు.
బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి డిసెంబరు 7వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్ ఆర్ఎన్ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన మంత్రి మోదీ దీర్ఘకాల దృష్టి అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు సమస్య కలిగించే ‘ఇడియాప్పం’ కాదని, సులువుగా జీర్ణమయ్యే ‘ఇడ్లీ’ వంటిదని బీజేపీ మహిళా నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కామెంట్ చేశారు.