Home » Chennai News
తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ప్రెస్ రవాణా సంస్థ (ఎస్ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.
వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నూతన ఎన్నికల చార్జులను నియమించింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మొహోల్లను ఇన్చార్జ్లుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
డీఎంకే మాజీ మంత్రి, ఆ పార్టీ కరూరు జిల్లా ఇన్ఛార్జి సెంథిల్ బాలాజీ కాంగ్రెస్ సభ్యులకు డీఎంకే సభ్యత్వం కల్పించి పార్టీలో చేర్చుకోవడంపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఆగ్రహం వ్యక్తం చేశా రు. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోం ది.
డీఎంకే కూటమిలోని ‘మక్కల్ నీదిమయ్యం’ (ఎంఎన్ఎం) ఈ సారి ఆచితూచి అడుగులేయాలని నిర్ణయించుకుంది. ‘ఇండియా’ కూటమిలో వున్న ఆ పార్టీ.. ఇప్పటికే తమకు మెరుగైన అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు ఆ స్థానాలను డీఎంకే తమకు కేటాయించేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు.
తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి దివంగత నేత కరుణానిధిని ఆదర్శంగా తీసుకుని శ్రమించడమే కాకుండా, అందరికీ అన్ని సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.
అన్నాడీఎంకే ఎవరికీ తలవంచదని, మిత్రపక్షాలను బానిసలుగా చూడటం డీఎంకే నైజమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో నియోజకవర్గాల వారీగా ఈపీఎస్ చేస్తున్న ప్రచారయాత్ర నీలగిరి జిల్లాలోని గూడలూరు నియోజకవర్గానికి చేరుకుంది.
రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేసి తీరాల్సిందేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టుబట్టడం విడ్డూరంగా ఉందని.. ఈ వ్యవహారం రెండు ఇడ్లీలు చాలని చెప్పే బాలుడి నోట్లో మూడో ఇడ్లీ కుక్కినట్లుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఎద్దేవా చేశారు.
శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉండడంతో సైన్యంలో చేరేందుకు నిరాకరించబడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదురై తత్తనేరి అరుళ్దాస్పురం ప్రాంతానికి చెందిన బాలమురుగన్ కుమారుడు యోగసుధీష్ మదురైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు.
అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు.