Home » Chennai News
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 4,829 మద్యం దుకాణాల్లో మూడు రోజుల్లో రూ.790 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగ జరుపుకున్నారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే ఆ పార్టీ పత్తాలేకుండా పోతుందని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయ్కుమార్ హెచ్చరించారు.
స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్పై చేయిచేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.రాజ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్కుమార్ ఆయనపై చేయి చేసుకున్నారు.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేలా ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే తేనికి వెళ్లి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల పర్యవేక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన మూడు రోజులకే ఉగ్రరూపం దాల్చటంతో చెన్నై(Chennai) పరిసర జిల్లాల్లో, కావేరి డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో శనివారం కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఈ నెల 25వ తేదీ కోయంబత్తూరులో పర్యటించనున్నారు. అక్కడి ఈషా యోగా కేంద్రంలో ఈ నెల 26వ తేదీ జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
కరూర్లో సెప్టెంబర్ 27రాత్రి నిర్వహించిన రోడ్షోలో జరిగిన తొక్కిసలాటలో గాయపడినవారికి కూడా త్వరలోనే తలా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని టీవీకే నేత విజయ్ ప్రకటించారు. తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబాలకు ఆయన తలా రూ.20 లక్షల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో జమచేసిన విషయం తెలిసిందే.
దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువుల సంతల్లో గొర్రెల విక్రయాలు వారం రోజుల ముందునుంచే ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో ఉన్న కొత్తాంబాడి పరిధిలోని కల్పకనూర్లో గురువారం పశువుల సంతలో గొర్రెలు, పశువులు, కోళ్ళు తదితరాల విక్రయాలు జోరందుకున్నాయి.
రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించారు. అలాగే, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5,308 మంది కార్మికులకు కూడా బోనస్ ప్రకటించారు. ఈ విషయమై రవాణా శాఖ మంత్రి శివశంకర్ మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా రవాణా శాఖలో పనిచేస్తున్న 1,05,955 మంది ఉద్యోగులకు బోనస్, గ్రాట్యుటీ నిధిగా రూ.175.51 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు తెలిపారు.
తేయాకు తోటల్లో పులి సంచరిస్తుండడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని తుమ్మంటి గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న తేయాకు తోటలో పులి ప్రవేశించింది.