Home » Chandrababu Naidu
ఈరోజు (ఏప్రిల్ 14) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. దేశం కోసం బాబాసాహెబ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్పై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడులకు పాల్పడుతోందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు సోమవారం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్కు శంకుస్థాపన చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు రేపు(సోమవారం) భూమి పూజ జరగనుంది. కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు.
సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసి అరుదైన రికార్డు సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కీలక పోరులో సమష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజయం సాధించడం భారత క్రీడాభిమానులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదిక పోస్టులు పెట్టారు.
శ్రీకాకుళంలో కలకలం సృష్టిస్తున్న డయేరియా అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు..