• Home » Central Govt

Central Govt

Mahesh Kumar Goud: వీబీ-జీ రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: వీబీ-జీ రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి: మహేశ్ కుమార్ గౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌)’ (వీబీ-జీ రామ్‌ జీ)పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Ramakrishna: ప్రపంచాన్ని బెదిరించే స్థాయికి ట్రంప్.. రామకృష్ణ ఫైర్..

Ramakrishna: ప్రపంచాన్ని బెదిరించే స్థాయికి ట్రంప్.. రామకృష్ణ ఫైర్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

 Purandeswari: చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావు.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..

Purandeswari: చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావు.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..

గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ముందుగా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సూచించారు. తాజాగా ఉపాధి హామీ చట్ట సవరణ ద్వారా 15 రోజుల్లోగా కూలి చెల్లించకుంటే జరిమానాతో కలిపి లబ్ధిదారుడికి అందజేస్తామని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలోనూ రైతులను, సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని వివరించారు.

Kishan Reddy: ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ

Kishan Reddy: ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వరంగల్ కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని సూచించారు.

CM Chandrababu: ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏపీ కీలక మైలురాయి సాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టులో కొత్త రెసిడ్యూ అప్‌గ్రెడేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.

Bhogapuram Airport:భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం

Bhogapuram Airport:భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం అత్యంత ఆధునిక సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తయారైనట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్, సీఈఓ రణబీర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

Union Minister Ram Mohan Naidu: వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..

Union Minister Ram Mohan Naidu: వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..

శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు.

Bandi Sanjay: మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే.. కూనంనేనిపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే.. కూనంనేనిపై బండి సంజయ్ ఫైర్

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy: ‘ఉపాధి’పై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర నిర్ణయం... సీఎం ఫైర్

CM Revanth Reddy: ‘ఉపాధి’పై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర నిర్ణయం... సీఎం ఫైర్

పేదల హక్కులు దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Kishan Reddy: జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సంపూర్ణ సహకారం: కిషన్‌రెడ్డి

Kishan Reddy: జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సంపూర్ణ సహకారం: కిషన్‌రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి