Home » Central Govt
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న తనకు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. 15ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా గొప్ప విశేషమని మోదీ తనకు కితాబిచ్చారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 16వ తేదీన శ్రీశైలంలో పర్యటించనున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని మోదీ తొలిసారిగా రానున్నారు.
సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని ఉద్ఘాటించారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు సహకారం ఎందుకు అందించడం లేదని గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు.
అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆన్లైన్లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్రెడ్డి తెలిపారు.
భారత సముద్ర రవాణా వాణిజ్య రంగంలో శివాలిక్ కీలక పాత్ర పోషించనుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని షిప్ బిల్డింగ్ దేశాలలో భారత్ టాప్ 10లో ఒకటిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు.