Home » Central Govt
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వ తేదీన గాంధీభవన్లో భారీ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ జాబ్మేళాలో 100 కంపెనీలు గాంధీ భవన్కు వస్తున్నాయని వివరించారు.
పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీసు ధ్రువీకరణ సేవలకు గాను ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ వరించింది.
కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని తలపెట్టిన వీబీజీ రాంజీ స్కీం పట్ల నిరసన తెలపాలని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తమ నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్కి సంబంధించిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి భారత్లో మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సెక్యూరిటీల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సంక్షోభాలను ముందే ఊహించి, వాటిని అడ్డుకునేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది.
దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు..
ఏపీలో కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తామని పేర్కొన్నారు.
దేశ సమస్యలు, విద్యావ్యవస్థలో లోపాలపై రానున్న రెండు, మూడు నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచారాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు ప్రధాని మోదీ వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు.
పెట్రోల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. అయితే.. అందరూ ఉపయోగించే సాధారణ పెట్రోల్కు కాదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ వినియోగించే వారికి మాత్రమే.