Home » Central Govt
కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లపై నిషేధం విధించింది. దీంతోపాటు 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయితే ఎందుకు ఇలా చేసింది, కారణాలు ఏంటనేది ఇక్కడ చుద్దాం.
ప్రజలపై శునకాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 23 జాతుల క్రూరమైన శునకాల పెంపకంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రలో రైతులు, పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ. వి హనుమంతరావు (V. Hanumanthao) తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన కొన్ని గంటలకే మరో గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ట్విటర్ వేదికగా ప్రకటించారు.
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం తప్పిదాల వల్ల సింగరేణి (Singareni)కి భారీ నష్టం వాటిళ్లిం దని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. త్వరలోనే తాడిచెర్ల కోల్ బ్లాకు అనుమతులకు ఆదేశాలు ఇస్తామని కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని తెలిపారు. గురువారం నాడు కేంద్ర బొగ్గు శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి,కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ని భట్టి విక్రమార్క కలిశారు.
ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఏ పెంపునకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) గురువారం కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్(డీఆర్)ను ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు శాతం పెంచినట్లు పీయూష్ ప్రకటించారు.
లక్టోరల్ బాండ్లతో అక్రమంగా సంపాదించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. గురువారం నాడు ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నా.. కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఎస్బీఐ ఎదుట షర్మిలతో పాటు జేడీ శీలం, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు నిరసన చేపట్టారు.
పదేళ్ల బీఆర్ఎస్(BRS) దిక్కుమాలిన విధానాలతో ప్రజలు నష్టపోయారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుని రాజీవ్ రహదారి(SH01) ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పక్కన పెట్టిందని మండిపడ్డారు. గురువారం నాడు సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి(SH01) ఎలివేటెడ్ కారిడార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman ) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈనెల 12వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన కుంగిపోయిందని.. ఈ విషయాలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు సచివాలయంలో నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.