Home » CBI
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ వెనుక 'యాష్ యాదవ్' కీలక పాత్ర పోషించినట్లు సీబీఐకి ఆధారాలు లభ్యమయ్యాయి.
లంచం మొత్తం కేవలం రూ.4 వేలు. కానీ, ఆ ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు సీబీఐకి ఏకంగా 9 నెలల సమయం పట్టింది! తెలంగాణలో సీబీఐకి ‘జనరల్ కన్సెంట్’ (సాధారణ అనుమతి)లేకపోవడం వల్ల కేసుల నమోదు ప్రక్రియ ఎంత ఆలస్యమవుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు.
నీట్ పేపర్ లీక్కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. లాతూర్కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మొబైల్లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సీబీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే స్వభావం కలిగినది కాదని సీబీఐ తన వాదనలో పేర్కొంది.
ఐపీఎస్ అధికారి దీపక్ గహ్లావత్ అరెస్ట్ అయ్యారు. 3 కోట్ల రూపాయల లంచం కేసులో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
త్విశా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. నిన్న (సోమవారం) సీబీఐ అధికారులు భోపాల్ వెళ్లారు. త్విశా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్పై ఎఫ్ఐఆర్ను రీరిజిస్టర్ చేశారు. దాదాపు 10 గంటల పాటు సీబీఐ అధికారులు సమర్థ్ను విచారించారు.
నటి ట్విష శర్మ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపింది.