Home » CBI
ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయదులు, న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికాసేపట్లో హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్కు ఈ ఫిర్యాదును న్యాయవాది అందించనున్నారు.
BRS MLC Kavitha: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడంపై.. ఆమె తరపు న్యాయవాది మోహిత్రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్.. మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు..
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు(Kejriwal) సుప్రీంకోర్టులోనూ(Supreme Court) నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ(ED) అరెస్ట్పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ..
MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్(Tihar) జైల్లో ఉన్న కవిత(MLC Kavitha).. మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును(Rouse Avenue Court) ఆశ్రయించారు. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కవితకు..
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. నేటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును సీబీఐ కోరింది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల పాటు అంటే ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే...14 రోజులు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ రిమాండ్ అప్లికేషన్లో పలు అంశాలను ప్రస్తావించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని అందులో పేర్కొంది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court). లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో..
Telangana: ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్క్వార్టర్స్లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అవకాశం ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సీబీఐ పేర్కొంది...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న కవితను మూడు రోజులు కస్డడీకి తీసుకుని విచారించేందుకు సీబీఐకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది....