Home » BSNL
80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినూత్నంగా కొన్ని ఆఫర్లు తీసుకువచ్చింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ CGM ఎం. శేషాచలం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్రీడం 2.0 ఆఫర్ కింద ఒక్క రూపాయికే సిమ్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ సరికొత్తగా శాటిలైట్ ఫోన్ లాంచ్ చేసింది. దేశంలో మొబైల్ నెట్వర్క్ లేని మారుమూల ప్రాంతాలు, కొండ కోనల్లోనూ మాట్లాడేందుకు వీలుగా ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ. 1,34,166గా నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. భారత్ నెట్ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ వివేక్ బంజల్ వివాదంలో చిక్కుకున్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన విస్తృత ఏర్పాట్లు చేసుకోవడం, ఇందుకు సంబంధించిన ఆయన చేసిన డిమాండ్లు వైరల్ కావడంతో కేంద్రం సీరియస్ అయింది.
2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి 'ఏపీ ఫైబర్ నెట్'ను ప్రారంభించామని.. దీనివల్ల 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు..
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ సందర్భంగా ప్రారంభించిన 3GB రోజువారీ డేటా ప్రమోషనల్ ఆఫర్ ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
BSNL రూ. 399కే హోమ్ బ్రాడ్బాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఒక నెల ఫ్రీ.. ప్రతీనెలా రీచార్జి మీద వంద రూపాయలు చొప్పున మూడు నెలలపాటు డిస్కౌంట్. ఈ ప్లాన్ ద్వారా 60 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ నెలకు 3300 జీబీ డేటా..
భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మన జీవితం రోజురోజుకు టెక్నాలజీతో మరింత సులభమవుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలోని టెలికాం రంగంలో మొబైల్ నెట్వర్క్ లేకపోయినా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీనిని ఇటీవల భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రవేశపెట్టింది.
నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ను లాభాల బాటలోకి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా బీఎస్ఎన్ఎల్ సేవల అందాలని తెలిపారు.