Home » BRS
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు స్పందించారు. సూర్య వ్యాఖ్యలపై అర్థంపర్థం లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ ఆయన ఫైరయ్యారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని నిరంజన్ రెడ్డి విమర్శించారు. భారత రాజ్యాంగానికి లోబడి, పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.
పార్లమెంట్ వేదికగా డీలిమిటేషన్ బిల్లుపై ప్రసంగించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారంటూ అసభ్య పదజాలం వాడుతూ ఘాటుగా విమర్శించారు.
తెలంగాణలో నిర్వహించిన కుల గణన గణాంకాలు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీల అసలు జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపిస్తున్నారని విమర్శించారు.
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణ గానో మిగిలిపోదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మర్యాదను తగ్గించేలా ఎప్పుడూ తాము మాట్లాడలేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గమైన పరిపాలన చేశారని ధ్వజమెత్తారు.
దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ పార్టీ కాంగ్రెస్లో మనమంతా పని చేయటం అదృష్టమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం తెచ్చిందని ఉద్ఘాటించారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం తడకపల్లిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కొందరివాడు కాదని.. అందరి వాడని వ్యాఖ్యానించారు.