Home » BRS
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, రాజకీయ ప్రయాణాన్ని, భవిష్యత్తు ఆశయాలను ప్రతిబింబించాయని వారు తెలిపారు. ఒకవైపు ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ, మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేశారు. ఈ పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచాయని.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ కోసం నా చెమట, రక్తం, సమయం ధారపోసి పనిచేశా. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. కానీ, మనం కలలు కన్న తెలంగాణ రాలేదు....
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని ఆమె చెప్పారని ప్రస్తావించారు.
తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఒక కీలక కేసులో భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. 2011లో జరిగిన 'మిలీనియం మార్చ్' సందర్భంగా నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణం కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతిని కేంద్ర మంత్రి రాజకీయం చేస్తున్న తీరు హేయనీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామూహిక వందేమాతర గీతాలాపన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానించినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికవంటిదని మాజీ మం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి గీత కన్నుమూశారు. ఈ సంఘటన కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా బీఆర్ఎస్ నేతలను కూడా తీవ్ర విషాదంలో ముంచింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.