Home » BRS
కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్కు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడంలేదని సీఎం తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్త రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెడ్ పెన్తో రాసిన లేఖపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని లేఖలో పేర్కొన్నారు.
తాను పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ'కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం నాడు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది.
కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఇరిగేషన్పై లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో ఎనర్జీ స్టోరేజ్ హబ్గా మార్చేందుకు కేసీఆర్ హయాంలో చేసిన తమ ప్రయత్నాలు ఫలించడం చూసి చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మృతిపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ముద్రగడ చేసిన సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన చేసిన కృషిని బీఆర్ఎస్ అగ్రనేతలు కొనియాడారు.
రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్పై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయిందని తెలిపారు.
సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు.