Home » BRS
ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలో పీక్స్కు చేరాయి. ఒకవైపు కేటీఆర్ టూర్ మరోవైపు మంత్రి తుమ్మల కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కార్పొరేటర్ల జంపింగులు ముందస్తు ఎన్నికల వ్యూహాలతో ఖమ్మం రాజకీయం హీటెక్కిపోతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనినాస్గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలసలు పోయింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ఆరోపణలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
బీఆర్ఎస్కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను, మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశా. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి.. .....
శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. సంచలన కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ కవిత శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి ఛైర్మన్కు కవిత విజ్ఞప్తి చేశారు.
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొత్తం మూడు ముక్కలుగా చేయడంపై భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం తమ స్వార్ధ ప్రయోజనాలకోసం మూడు ముక్కలు చేస్తోందన్నారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం భజన చేసేందుకు తాము అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు.