Home » BRS Chief KCR
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మాజీమంత్రి కేటీఆర్ బద్నాం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు. పవర్ లేకపోతే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బతకలేక పోతున్నారని దెప్పిపొడిచారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాపం అంబేద్కర్.. ఇంత దగుల్బాజీ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఊహించలేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏకపక్షంగా గెలుస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు.
ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్రావుని నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు చర్చించారు.
పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావువ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరని చెప్పుకొచ్చారు.
దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు. బీసీల పట్ల బీఆర్ఎస్కి చిత్త శుద్ధి లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్నే అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు కేసీఆర్ కుటుబం సభ్యులని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో మీకు సంబంధం ఏంటని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
తనతో చర్చకు రాకుండా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దని కేటీఆర్ హితవు పలికారు.