Home » Bihar Elections 2025
బిహార్లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. అవకాశం వస్తే తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని చెప్పారు. మైథిలీ ఠాకూర్ను బిహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా ఎన్నికల కమిషన్ గతంలో నియమించింది.
తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ గెలుపును ఆశిస్తున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు బిహార్ను అభ్యుదయపథంలోకి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ తొలి జాబితాను నితీష్ కుమార్ ప్రకటించారు. సానాబార్సా నుంతి రత్నేష్ సదా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషద్, ఎక్మా నుంచి ధుమాల్ సింగ్, రాజ్గిర్ నుంచి కౌశల్ కిషోర్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
శాసనసభ ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సమగ్ర నివేదిక రూపొందించింది. బిహార్లోని 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. మొత్తం 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 194 మంది కోటీశ్వరులని నివేదిక స్పష్టం చేసింది.
జన్సురాజ్ పార్టీ ఇంతవరకూ 116 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం నితీష్ కమార్ కంచుకోటగా భావించే హర్నాట్ నియోజకవర్గం నుంచి కమలేష్ పాశ్వాన్ను బరిలోకి దింపింది.
సీట్ల పంపకాలపై విపక్ష మహాకూటమిలో అనిశ్చితి కొనసాగుతోంది. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు ఇంకా కొనసాగుతుండటంతో అధికారిక ప్రకటనలో జాప్యం చోటుచేసుకుంది.
హెచ్ఏఎం అభ్యర్థుల్లో దీపా కుమారి (ఇమామ్ గంజ్), అనిల్ కుమార్ (తెకరి), జ్యోతి దేవి(బరచాటి), రోమిత్ కుమార్ (అత్రి), ప్రఫుల్ కుమార్ సింగ్ (సికింద్రా), లలన్ రామ్ (కుటుంబ) ఉన్నారు.
బిహార్లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన ఠూకూర్ గతంలో రాజకీయాల్లోకి చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందన్నారు. తన నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు. లఖిసరాయ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు విజయ్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2005, 2010, 2015, 2020లో ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు.