Home » Bharath
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా తొలి రౌండ్ చర్చలు ముగియడంతో ఎంఈఏ తాజా ప్రకటన చేసింది. భారత్ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన అనంతరం ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి.
ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
బహవలాపూర్లోని భారీ కాంప్లెక్స్పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడంతో ఇరుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధి భారత్కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎస్సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.
భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి వచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోల్చితే ఆగస్టు 29న భారీగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అమెరికా భారత దిగుమతులపై విధించిన భారీ సుంకాలేనని నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 2038 నాటికి మన భారత్, కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందట. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.