Home » Betting apps
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్రాజ్కు నోటీసులు ఇవ్వడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ప్రకాష్రాజ్ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
బెట్టింగ్ యాప్స్ కేస్లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్రాజ్కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు ప్రకాష్రాజ్ బుధవారం విచారణకు హాజరు కానున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తు్న్న పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో సినీ హీరో విజయ్ దేవరకొండకు మరో సారి నోటీసులను జారీచేసింది.
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.
రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్పై పోలీసులు వరుస కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నా.. వాటి మోసాలు మాత్రం ఆగడం లేదు. వేల కొద్ది బెట్టింగ్ యాప్లను పోలీసులు బ్లాక్ చేయడమే కాకుండా...
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరై మొత్తం 29 మంది సినీ సెలెబ్రిటీలపై కేసు నమోదు చేసింది.
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది.
అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్లో రూ.15లక్షలు పొగొట్టుకుని ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి తట్టుకోలేక సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదోనీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఆదోనీలో శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్కు పాల్పడుతున్న బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ (betting apps) నిషేధంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.