Home » Bengaluru News
తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తునాన్నరన్న అనుమానంతో తోడుబుట్టిన తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలోని వెంకటేశ్వర క్యాంప్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వంద పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తల పెట్టిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖా మంత్రి, డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. కూడ్లిగిలో చెరువులకు నీరు వదిలే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర జలాశయంలో నీరున్నా కాలవలకు వదలడం సాధ్యం కాదన్నారు.
బెంగళూరు మహిళా డాక్టర్ హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. మహిళను చంపిన విషయాన్ని ఆమె భర్త స్వయంగా మరో మహిళకు మెసేజ్ చేసి చెప్పినట్టు పోలీసులు గుర్తించారు.
కేవలం సబ్సిడీలకోసం సినిమా తీయవద్దని, ఇటీవల సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడిందని, మంచి సినిమాలు తీసి రాయితీ పొందాలని సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి ఏడాది సినిమా పురస్కారాలు ఇస్తామన్నారు.
ఎంపీ తేజస్వీ సూర్య ఇంకా చిన్నపిల్లోడని, అనుభవం లేదని, అతను ఓ వేస్ల్ మెటీరియల్ అంటూ డీసీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో సొరంగ మార్గం నిర్మించరాదనేందుకు తేజస్వీ ఎవరని ప్రశ్నించారు.
వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.
రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కానీ ఇటీవల అన్ని విషయాలలోను కాంగ్రెస్కు చెందిన వారు హాట్టాపిక్ గా మారుతున్నారు. అటువంటి వారిలో చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా ఒకరు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న క్యాప్ను మార్చాలని నేనే సూచించానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు కొత్త టోపీల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. పీక్ క్యాప్ను కానిస్టేబుళ్లకు ధరింపచేసి ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.
కొంతకాలంగా సొరంగ మార్గంతోపాటు పలు అంశాలపై విమర్శలు చేసుకున్న డీసీఎం డీకే శివకుమార్, ఎంపీ తేజస్విసూర్య భేటీ అయ్యారు. డీసీఎం నివాసానికి వచ్చిన ఎంపీ పలు అంశాలపై చర్చలు జరిపారు.