Home » Bengaluru News
ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. అడ్వకేట్ అయిన భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు బెళగావి జిల్లా ఎస్పీ బీమాశంకర్ గుళేద్ తెలపారు. 7వ తేదీ కాగవాడ తాలూకా ఉగార గ్రామానికి చెందిన చైతాలి(23)ను హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు.
నీ భర్తను వదిలేసి రా నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను’ అని మాజీ ప్రియుడు ఆమెను నమ్మించారు. నన్ను ప్రేమించావు. వేరే వాళ్లతో పెళ్లిచేసుకుని పోతే నేను ఏమికావాలి అని రోజూ ఫోన్ చేసి ప్రేమను ఒలకపోశాడు. మాయ మాటలు నమ్మి పెళ్లి చేసుకున్న భర్తనే కాదనుకుని ప్రియుడు వద్దకు వెళ్లింది.
బెళగావి మెడికల్ కళాశాల ఆసుపత్రికి అనుబంధంగా ఉండే బిమ్స్ ఆసుపత్రిలో నకిలీ నర్సు సేవలందిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. రెండు మూడు నెలలుగా నర్సింగ్ విద్యార్థిగా చెప్పు కొని సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ నర్సింగ్ యూనిపాంలో ఆసుపత్రికి వచ్చి సర్జికల్ వార్డు, ఓపీడీతోపాటు వివిధ విభాగాలలో తిరుగుతూ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.
గ్రేటర్ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, నగర పాలికెసంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం సాయంత్రం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగింది.
బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్-ఉన్-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత్రి పరమేశ్వర్ స్పష్టత ఇచ్చారు.
నాగుల చవితి సందర్భంగా విగ్రహాలుగా ఉన్న నాగదేవతలకు పుట్టల వద్ద పాములుపూసి పూజించడం ఆనవాయితీ. ఎక్కడైనా నిజమైన పాము కనిపిస్తే వెంటనే కొట్టి చంపే ప్రయత్నం చేయడం సహజం.
బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు.
నగరంలో ఉత్సహంగా సాగుతున్న గణేశ్ ఉత్సవాల్లో సోమవారం తెల్లవారు జామున అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని గణేశ్ మండపం నుంచి నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
తుంగభద్ర నదికి నీరు ఎక్కువగా పోటు ఎత్తడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల నది ఒడ్డున వుండే మోటార్లలో నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.