Crocodile: నీటి గుంతలో మరోసారి ప్రత్యక్షమైన మొసళ్లు
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:50 PM
నగర సమీపం యక్లాస్పూర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ నీటి గుంతలో రెండు మొసళ్లు మరో సారి ప్రత్యక్షం కావడం స్థానికల్లో కలకలం రేపింది. యక్లాస్పూర్ గ్రామ శివారుకు వెళ్లే ఎన్ఆర్బీసీ కాలువ నీరు సర్వే నంబరు 347 పొలంలో భారీ గుంతలోకి వచ్చి చేరుతుండడంతో మొసళ్లు వచ్చి చేరాయి.
రాయచూరు(బెంగళూరు): నగర సమీపం యక్లాస్పూర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ నీటి గుంతలో రెండు మొసళ్లు(Crocodiles) మరో సారి ప్రత్యక్షం కావడం స్థానికల్లో కలకలం రేపింది. యక్లాస్పూర్ గ్రామ శివారుకు వెళ్లే ఎన్ఆర్బీసీ కాలువ నీరు సర్వే నంబరు 347 పొలంలో భారీ గుంతలోకి వచ్చి చేరుతుండడంతో మొసళ్లు వచ్చి చేరాయి. ఆ నీటిలో ఇప్పటికే రెండు మొసళ్లు ఉన్నట్లు గ్రామస్థులు తెలపగా గత ఆదివారం వాటిని బంధించేందుకు ప్రయత్నించిన అటవీ అధికారులు అవి చిక్కకపోవడంతో వెనుదిరుగారు.

గురువారం మరోసారి రెండు మొసళ్లు కనిపించినట్లు గ్రామస్థులు చెప్పడంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ నీటి గుంతలో పశువులు, మేకలు, గొర్రెలు నీరు తాగేందుకు వెళుతున్నాయని, కొంతమంది రైతులు ఆ నీటిని వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరగకముందే అటవీ శాఖ అధికారులు మేల్కొని మొసళ్లను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్మాల్!
Read Latest Telangana News and National News