Home » Bengaluru News
ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పోలీసులే దొంగలుగా మారారు. బాధ్యతగా ఉండాల్సిన రెండు చుక్కల అధికారులు కూడా దారితప్పారు. తమ స్వార్ధబుద్దితో ఓ వ్యాపారిని బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చివరకు కటకటాలపాలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఎనిమిది సంవత్సరాల బాలుడికి 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్ చేశారు. అయినా... ఫలితం లేకపోయింది. బాలుడు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అడవిపందిని వేటాడబోయి ఓ వేటగాడు దుర్మరణం పాలయ్యాడు. రామనగర జిల్లా మాగడి అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ మిస్ఫైర్ కావడంతో వేటగాడు పాండురంగా దుర్మరణం చెందాడు. స్నేహితుడు కిరణ్తో కలసి నాటుతుపాకీతో వేటకు వెళ్లారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్ట్రాక్ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.
బెంగళూరులో పట్టపగలే బ్యాంక్ సిబ్బందిని దుండగులు బురిడీ కొట్టించారు. ఆర్బీఐ అధికారులమంటూ బ్యాంక్ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది మోసగించి ఏటీఎం వాహనంలోని నగదుతో పరారయ్యారు.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
బెంగళూరులో తాజాగా మరో డిజిటల్ అరెస్టు ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్సిల్లో నిషేధిత పదార్థులు ఉన్నాయని బెదిరించిన నిందితులు ఏకంగా రూ.31.83 కోట్లను తన నుంచి దోచుకున్నారని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్ పేర్కొన్నారు.
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.