Home » Bengaluru News
నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరులోనే మకాం వేశారు. 15రోజుల వ్యవధిలో మూడు విడతలలో 9 రోజులపాటు బెంగళూరులో గడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్ధితోపాటు ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
భారతినగర్ ప్రాంతంలో రౌడీషీటర్ శివప్రకాశ్ అలియాస్ బిట్లు శివ హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం రాత్రి భారతినగర్లో కారులో వచ్చిన వ్యక్తులు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్రతిపక్షనేతగా రెండేళ్లుగా కొనసాగుతున్నా క్వార్టర్స్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని ప్రతిపక్షనేత ఆర్ అశోక్ మండిపడ్డారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ జిల్లా సిగందూరులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఖంగుతిన్న ముఖ్యమంత్రి వివాదం చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.
ఉత్తరకన్నడ జిల్లా ఓడరేవుకు అనుబంధమైన భట్కళ్ను 24 గంటల్లో పేల్చివేస్తామని మెయిల్ ద్వారా సందేశం పంపిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈనెల 10న ఉదయం 7.23 గంటలకు పోలీస్ స్టేషన్కు ఓ మెయిల్ వచ్చిందని ఉత్తరకన్నడ ఎస్పీ ఎం నారాయణ్ తెలిపారు.
దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేలో విప్లవాత్మక మార్పులొచ్చాయనీ, తాను పదవీబాధ్యతలు స్వీకరించిన స్వల్పకాలంలోనే రాష్ట్రంతో సహా అనేక ప్రదేశాలలో మరిన్ని రైళ్లు మంజూరయ్యాయని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న అన్నారు.
సిలికాన్ సిటీ బెంగళూరులో వీధికుక్కలకు మాంసాహారం అందించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె టెండర్లు ఆహ్వానించింది. 8 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. రూ.2.88 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనా వేశారు.
ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు.
ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే మార్పులు ఉంటాయని, అందులో ప్రధానంగా నాయకత్వ మార్పు ఉంటుందనే అంశం కొన్ని నెలలుగా హల్చల్ చేస్తోంది.