Home » Bangladesh
టీ20 ప్రపంచకప్-2026 నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మౌనంగా ఉన్న శ్రీలంక తాజాగా స్పందించింది. ఆ దేశ క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే బంగ్లా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ కప్-2026 విషయంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో పర్యటించమని స్పష్టం చేసిన బంగ్లాదేశ్.. తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా రైఫిల్ అండ్ పిస్టల్ ఛాంపియన్షిప్-2026 కోసం తమ బృందాన్ని భారత్కు పంపేందుకు బంగ్లా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..
టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లా విషయంలో ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ బంగ్లాను రెచ్చగొడుతోందని.. ఇది పద్ధతి కాదని ఆయన వెల్లడించారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సైతం తన వక్రబుద్ధిని చూపించాడు. భారత్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచ కప్-2026 నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ అంశంలో భారత్ను లాగి తన కుటిల బుద్ధిని చాటుకున్నాడు.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులు భయాందోళన కలిగిస్తున్నాయి. బంగ్లాలో మరో హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన కలకలం సృష్టించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం జరగుతుంది. ఓ స్పోర్ట్ నివేదికల ప్రకారం.. బంగ్లా జట్టు ఐసీసీ టోర్నీలో ఆడకుంటే.. 27 మిలియన్ డాలర్లు లేదా రూ.240 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచులను భారత్లో ఆడేదేలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. వేదికలను మార్చితేనే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది.
టీ20 ప్రపంచ కప్-2026లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరిన విషయం విదితమే. అయితే.. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో బీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయంపై తాజాగా బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది.