Share News

బంగ్లాదేశ్‌లో విషాదం.. ట్రక్కు బోల్తాపడి 15 మంది మృతి

ABN , Publish Date - May 25 , 2026 | 03:22 PM

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.

బంగ్లాదేశ్‌లో విషాదం.. ట్రక్కు బోల్తాపడి 15 మంది మృతి

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. మధ్య బంగ్లాదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రధాన రహదారిపై ఐరన్ రాడ్స్, ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. దేశ రాజధాని ఢాకాకు వాయువ్యంగా 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంగైల్ జిల్లాలోని సోరటోయిల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.


ప్రయాణికులలో ఎక్కువ మంది దినసరి కూలీలే ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఈద్ అల్-అధా(బక్రీద్) సందర్భంగా తమ సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. అయితే.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ట్రక్కు బోల్తాపడి ఈ విషాదం జరిగిందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఘటన అనంతరం.. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు ప్రతిధ్వనించినట్టు చెప్పారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఇవీ చదవండి:

బహిరంగ నమాజ్‌, జంతుబలి నిషేధం.. సీఎం యోగి కీలక ఆదేశాలు

భూగర్భ స్థావరంలో ఇరాన్ సుప్రీం లీడర్.. చర్చలపై ప్రభావం!

Updated Date - May 25 , 2026 | 04:26 PM