Home » Bangladesh
బంగ్లాదేశ్లో మతోన్మాదులు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. హిందువులను టార్గెట్గా చేసుకుని చంపేస్తున్నారు. గత నెలలో నలుగురు హిందులపై దాడులు జరిగాయి. ముగ్గురు చనిపోగా.. ఒకరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు.
బంగ్లాదేశ్కు మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఆమె తనయుడికి సంతాప లేఖ రాశారు.
డిసెంబర్ 12వ తేదీన హాదీపై దాడి జరిగిన తర్వాత ఫైసల్, ఆలంగీర్ షేక్ వంటి నిందితులు దేశం దాటి మేఘాలయ గుండా భారత్లోకి ప్రవేశించి అక్కడే తలదాచుకుంటున్నారంటూ ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తాజాగా ఓ వీడియో విడుదల చేసి ఫైసల్ ఖండించాడు.
బేగం ఖలీదా జియా (80) సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఢాకా అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో నవంబర్ 23న ఆసుపత్రిలో చేరిన ఆమె 36 రోజులుగా చికిత్స పొందుతూ వచ్చారు.
బంగ్లాదేశ్లో 40 ఏళ్ల ఓ హిందూ వ్యక్తిని సహోద్యోగి తుపాకితో కాల్చి చంపేశాడు. అయితే, ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు చెప్పటం గమనార్హం. దీపు చంద్రదాస్ హత్యకు గురైన మైమెన్సింగ్లోనే ఈ దారుణం జరిగింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా కన్నుమూశారు. ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
బంగ్లాదేశ్లో హింస చెలరేగుతోంది. తమ నేత హాదీని హత్యచేసిన ఇద్దరు వ్యక్తులు భారత్లో ఉంటున్నారని ఆరోపిస్తూ.. తాజాగా భారత్ వ్యతిరేక నిరసనలు చేపట్టింది ఇంకిలాబ్ మోంచా. అక్కడి భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది.
బంగ్లాదేశ్లో అల్లరి మూకలు రభస సృష్టించడంతో ప్రముఖ సింగర్ జేమ్స్ తలపెట్టిన సంగీత కార్యక్రమం శుక్రవారం రద్దయిపోయింది. ఉన్మాదంతో రెచ్చిపోయిన అల్లరి మూకలు ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో నిర్వాహకులు కాన్సర్ట్ను క్యాన్సిల్ చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను, హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో పాపం అనుకున్నా భారతీయులు, పొరుగు దేశం బంగ్లదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.