Home » Bangladesh
సిలిగురి కారిడార్లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా, బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి ముప్పునైనా తట్టుకునేలా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.
బంగ్లాదేశీలు భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. హిందూ పేర్లు పెట్టుకుని ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి ప్రభుత్వ పథకాల్ని అనుభవిస్తున్నారు. మరోవైపు, ఉత్తరాఖండ్లో సాధువులుగా మారువేషాలు వేసుకుని భక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు.
ఐర్లాండ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 217 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
బంగ్లాదేశ్లో శుక్రవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో కోల్కతాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని, తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు.
భారత్ , బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఐసీటీ ఇచ్చిన తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్షపడేలా చేసిందన్నారు.
నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్ఆర్మ్స్, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి.
సిల్హెట్ వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.