Home » Ayyanna Patrudu
ఈనెల17వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కో-ఆర్డినేషన్ సమావేశమైంది.
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కన్నా లక్ష్మీనారాయణను చూసి చాలా నేర్చుకోవాలని సూచించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడంలేదని, సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకని, అలాంటివారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, నియోజకవర్గాల కోసం పని చేయకపోతే మీరెందుకంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.
రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం 'సంకల్పం 2.0' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమవారం అనకపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతరేకించిన తీరును ఆయన తప్పుపట్టారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వెలసిన శ్రీ శాంతామణి దేవి పండుగ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.
అనకాపల్లి జిల్లా నాతవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు నేతలు.