Home » Ayyanna Patrudu
ఏపీ అసెంబ్లీని ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు వీక్షించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఈరోజు సభలో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు.
ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైసీపీ సభ్యులు కేవలం 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు.
చట్ట సభల్లో 'నో వర్క్.. నో పే' విధానం అమలులోకి తీసుకురావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీనిపై చట్టం చేసి.. తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు.
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరిగాయి.
జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అన్న అయ్యన్న.. అసెంబ్లీకి రాకపోవడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. సోమవారం నాడు అనపర్తి మండలం కుతుకులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
గత జగన్ ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం 435 కోట్ల రూపాయలు ఇస్తోందని మంత్రి అనగాని తెలిపారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో పదివేలు ఇస్తూనే.. ఫైన్ల ద్వారా 20,000 రూపాయలు దోపిడీ చేసిందని ఆరోపించారు.
సినిమా నటులకు అవమానం జరిగిందని కామినేని శ్రీనివాస్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎనిమిది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి .