Home » AV Ranganath
హైడ్రా నగరానికి రక్షణగా నిలిచిందని, ఆక్రమణదారుల పట్ల బుల్డోజర్లా వ్యవహరించిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల గురించి కమిషనర్ సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రంగనాథ్ పేర్కొన్నారు.
హైడ్రా.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంస్థ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సంస్థ..
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
రాజేంద్రనగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
సిటీ: వర్షాకాల అత్యవసర బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) సూచించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందుగానే సన్నద్ధం కావాలని సూచించారు.
చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, అందులోకి వచ్చే వరద ప్రవాహం, అలుగులు, అవుట్లెట్ల ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటిపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.
ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్ చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరులకు సూచించారు.
ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు హైడ్రా కమిషనర్ ఆవుల వెంకటరంగనాథ్ విచ్చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిత్యం ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. దీంతో క్షేత్రస్థాయి పర్యటించి పరిశీలించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ‘ప్రజావాణి’లో వచ్చిన ప్రతి పిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.