Home » AV Ranganath
2026లో లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... 15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందని ఆయన అన్నారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్ ఆగొద్దు అని అధికారులకు హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. బుధవారం ఆయా సంస్థల కమిషనర్లు ఆర్వీ కర్ణన్, ఏవీ రంగనాథ్ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని శుక్రవారం కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్గుల్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను(వెంచర్) బుధవారం కూల్చివేశారు. ఇక్కడ 1986లో టెలికాం కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది.
ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను గత నెలలో హైడ్రా అధికారులు పలు శాఖల అధికారుల సమన్వయంతో కూల్చి వేసిన విషయం తెలిసిందే. అక్టోబరులో మళ్లీ భారీ స్థాయిలో కూల్చివేతలు చేపడతామని స్థానికులకు చెప్పి వెళ్లారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
మాంగార్ బస్తీ, ముషీరాబాద్ వినోభానగర్లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు.