Home » Atchannaidu Kinjarapu
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
గత ప్రభుత్వం ఐదేళ్లూ రాష్ట్రంలో పశుసంవర్థకశాఖకు తాళాలు వేసేసిందని ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పశువులకు దాణా పంపిణీ, వ్యాక్సినేషన్ కూడా ఆపేశారని విమర్శించారు.
యూరియా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలు చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఎక్కడకూ ప్రభుత్వం పారిపోవడం లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
11 సీట్లు వచ్చిన పార్టీ నేతలు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే గూబ పగలగొట్టాలి అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో ... జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పు అని అన్నారు.
జగన్కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.
ఓ పిచ్చోడికి అధికారం ఇస్తే ఏలా ఉంటుందో 2019-24 మధ్య చూశాం. జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశాడు అని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
వ్యవసాయశాఖలో సంస్కరణలు, రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.
మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే ఇంటింటికీ యూరియా ఇస్తామని వెల్లడించారు. రూ.300కంటే ఎక్కువకు యూరియా అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
రైతులకు ఏ సమస్య వచ్చినా వారు అడక్కముందే స్పందించి, మేలు చేస్తుంటే.. రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా వెలగబెట్టిన జగన్.. వారిలో అయోమయం సృష్టిస్తున్నారని...