Home » Assembly elections
బిహార్ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరినట్టు జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా తెలిపారు. బిహార్లో శాంతిభద్రతల సమస్య కానీ, నక్సల్స్ సమస్య కానీ లేవనీ, మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించిన తరహాలోనే బిహార్లోనూ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో కోరామన్నారు.
రాష్ట్రప్రజల అండదండలతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 210 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారం చేపడతామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు.
బిహార్ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లు ప్రభావితం చేసే అవకాశాలు మెండు. ప్రధాన పార్టీలు, కూటములు ప్రధానంగా మహిళా ఓటర్లను కీలకంగా భావిస్తూ ప్రచారం సాగిస్తుంటాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.
కరూర్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు.
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు 17 రాత్రి వరకు కొత్తగా ఓటు నమోదుకు 6,563 దరఖాస్తులు, తొలగింపు కోసం 361, సవరణ కోసం 2,298 దరఖాస్తులు వచ్చాయి.
ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను ఈనెల 30న ఈసీ ప్రకటించింది. ఇందులో అదనంగా 3.66 లక్షల అనర్హులైన ఓటర్లను తొలగించగా, 21.53 లక్షల అర్హులైన ఓటర్లను జాబితాలోకి చేరింది.
బిహార్లో 22 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఈసీ చేపట్టడం విశేషం. ఓటర్ల తుది జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది. తుది జాబితా కాపీలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపిస్తామని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలిపారు.
కరూర్ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.