Share News

Jubilee Hills by-election: తనిఖీల్లో రూ.25 లక్షల నగదు స్వాధీనం

ABN , Publish Date - Oct 14 , 2025 | 07:23 AM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ (ఎస్‌ఎస్‏టీ) సోమవారం చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌కు చెందిన జైరాం తలాసియా కారులో యూసుఫ్‏గూడ వైపు వెళ్తున్నారు.

Jubilee Hills by-election: తనిఖీల్లో రూ.25 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Jubilee Hills by-election) నేపథ్యంలో స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ (ఎస్‌ఎస్‏టీ) సోమవారం చేపట్టిన తనిఖీల్లో భాగంగా రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌కు చెందిన జైరాం తలాసియా కారులో యూసుఫ్‏గూడ(Yusufguda) వైపు వెళ్తున్నారు.


city3.jpg

మైత్రీవనం క్రాస్‌రోడ్డు(Maitreevanam Crossroads) వద్ద, సారథి స్టూడియో సమీపంలో ఎస్ఎస్‏టీ బృందం తనిఖీ చేయగా కారులో రూ.25 లక్షల నగదు లభ్యమైంది. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాధీనం చేసుకున్న నగదును ఎస్‌ఎస్‌టీ బృందం అధికారులు స్థానిక మధురానగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

వేరుశనగ రైతులకు ఉచిత విత్తనాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 14 , 2025 | 07:23 AM