Home » Assembly elections
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం రూ.1,302కోట్ల కేటాయించినట్లు ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.
బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ‘రైతు స్నేహితుడు మోదీ’ నినాదంతో సరికొత్త ప్రచారం చేపట్టనున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి వంద మందిని నియమించారు.
కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నికల పోలిం గ్ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్’ పార్టీ ఉండదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. కారైక్కుడి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సోమవారం పలు ప్రాంతాల్లో కార్తీ చిదంబరం ప్రచారం చేశారు.
పెరంబూర్ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్ తరఫున దాఖలుచేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం పాత బస్తీలో నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని ప్రాంతీయ నాయకులను బీజేపీ పక్కనపెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన సాగిస్తోందని విమర్శించారు.
అస్సాం ముఖ్యమంత్ర హిమంత బిశ్వా శర్మపై కాంగ్రెస్ సీనిర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అత్యంత అవినీతిపరుడని, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న ముఖ్యమంత్రి అని అన్నారు.
త్వరలో జరుగనున్న అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎల్డీఎఫ్ ఉద్వాసనకు కౌంట్డౌన్ మొదలైందని చెప్పారు.