Home » Assembly elections
అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఉదయనిధికి కౌంటర్ ఇచ్చేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్(EPS) ఘాటుగా విమర్శించారు. వారి పార్టీ వెంటిలేటర్పై ఉందన్న వాస్తవాన్ని గ్రహించకుండా అన్నాడీఎంకే ఐసీయూలో ఉందని ఉదయనిధి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అంబులెన్స్లు వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్షోలు చేస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీ ఐసీయూలో చేరటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) జోస్యం చెప్పారు. సైదాపేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆరంతస్థుల ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు.
ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి అని తాను చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది జాతీయ పార్టీ అని, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి 210 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పూర్వవైభవం రావాలన్న ఆశతో ఉన్నారని గుర్తు చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తిరుచ్చి నగరంలో ఆయన ప్రచారం ప్రారంభించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. విజయ్ పర్యటన కోసం సకల సదుపాయాలతో ఓ లగ్జరీ బస్సు పయనూరులోని ఆయన నివాసం వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు.
విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్లోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.