Home » Assembly elections
వారానికి నాలుగురోజుల పాటు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకేకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం స్టాలిన్న జరిగింది.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే నేత, హీరో విజయ్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉంటారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా సాత్తూరు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 15వ తేదీలోగా ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడవు నవంబర్ 22వ తేదీలో ముగియనున్నందున ఆ రోజుకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ గడువుకు ముందే ఎన్నికల ప్రక్రియ ఈసీ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల సన్నాహకాలు, తుది ఓటర్ల జాబితాపై సమీక్ష కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వచ్చే వారంలో బిహార్లో పర్యటించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేలా ప్రచారం కూడా చేపట్టాలని ‘మక్కల్ నీదిమయ్యం’ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలుసుకుని కారులో తిరిగి వెళుతూ తాను ముఖం చాటేశానంటూ వస్తున్న విమర్శల్ని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొట్టిపారేశారు. చెమటపడితే రుమాలుతో తుడుచుకుంటూ వెళ్లానని, దానిపై ప్రసార మాధ్యమాలకు తోడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ యూసుఫ్గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
తన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యేవారని బీజేపీ నేత శరత్కుమార్ వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ప్రచారానికి లక్షలాది మంది తరలిరావడంపై పలు పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు స్పష్టం చేశారు.