Home » AP Police
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కొవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్పై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యపై భర్త పులిచెర్ల వెంకటేశ్వర్లు బాణంతో దాడి చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అత్త గుళ్ల కోటమ్మ తీవ్రంగా గాయపడింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు.
మచిలీపట్నంలో త్రినాథ్ రావు అనే వ్యక్తి రజనీకుమారికి కోటి రూపాయలను బంగారం కోసం ఇచ్చారు. ఈ నగదు ఇవ్వాలని ఆమెను అడగడంతో తన భర్త గూడవల్లి రాజశేఖర్, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి కత్తితో దాడి చేయించారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి సహా 17 మంది ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని మద్దిలపేట గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి రూ.50 వేల నగదును అపహరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సింహాచలంలో జరిగిన రాధాగాయత్రి అంత్యక్రియలకు.. ఆమె భర్త శ్రీచరణ్ తల్లిదండ్రులతో పాటు బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడి పలు కీలక విషయాలను వివరించారు.