Home » AP Police
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..
కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మహాత్మా గాంధీ విగ్రహానికి కట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది..
శిశువుల విక్రయం కేసులో పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా అనుకున్నారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత.. కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్ను పట్టుకున్నారు..
పరకామణి కేసులో పోలీసులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తిరుపతి జిల్లాలోని వడమాలపేట మండలంలో ఎస్ఐ హరీశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్పను రాగినేపల్లి గ్రామానికి చెందిన హరి, చిన్నప్ప హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తిరుపతి జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పాకాల మండలంలో గల కొనపరెడ్డిపల్లి శ్రీరామాలయం వద్ద చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు దొంగలను స్థానిక గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం శానంభట్లలో న్యూఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ జల్లికట్టు (పశువుల పండుగ) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో వేగంగా పరిగెత్తే కోడె గిత్తలను యువకులు నిలువరించడానికి ప్రయత్నించడంతో పల్లె వీధులు రణరంగంగా మారాయి.