Home » AP Police
జగ్గయ్యపేట, నందిగామలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముగ్గురు నిందితులను జగ్గయ్యపేట ఎస్సై రాజు శనివారం అరెస్టు చేశారు. జగ్గయ్యపేటలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వచ్చి అతడు దొరక్కపోవటంతో అతడు బైక్ను ఎత్తుకెళ్లిన నిందితులు చైన్ స్నాచింగ్కు పాల్పడటం విశేషం. చైన్ స్నాచింగ్ కోసం దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ సుఫారీ విషయం వెల్లడైంది.
సంచలనం కలిగించిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో 11 మంది ఇన్స్పెక్టర్లు, పదిమంది ఎస్ఐలను నియమించారు.
విజయవాడ నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్స్టాలో పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు.
సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది.
తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన 14 మందికి ఐపీఎస్లుగా పదోన్నతులు కల్పిస్తూ..కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులు నిర్ధేశించుకున్న లక్ష్యం సాధించేవరకూ పట్టు వదలకుండా కృషి చేయాలని ఎస్పీ జగదీష్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్లో 2024-25 విద్యాఏడాదిలో 10వ తరగతి, ఇంటర్, ఎంటెక్, ఎంబీఏలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఎప్పీ మాట్లాడుతూ... పోలీసు ఉద్యోగుల పిల్లల్లో ప్రతిభను గుర్తిస్తూ మెరిట్ స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు. విద్యార్థులు..
బ్లాస్ట్ ఘటనలో తీవ్ర గాయాలతో నలుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వివరించారు. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పేర్కొన్నారు. గాయాల శాతం అధికంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారని అన్నారు.
నాన్న గొడ్డలిపోటుతో పడిఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేసారని ఆరోపించారు. హత్య తరువాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవి హత్య చేసారని తనని సంతకం పెట్టామన్నారని ఆమె తెలిపారు
వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.