Home » AP Police
చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా టంగుటూరులోని ఓ పొగాకు కంపెనీలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగాకు బేళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేలకు పైగా పొగాకు బేళ్లు దగ్ధమయ్యాయి.
సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా 'ఆపరేషన్ చిన్నారి తల్లి' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు.
మచిలీపట్నం చిలకలపూడి సర్కార్ తోట ప్రాంతంలో ఉపాధ్యాయురాలు మార్క్రేట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 50 తులాలు బంగారం, రూ.140,000 నగదును దుండగులు చోరీ చేశారు.
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ నాయక్పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
కడప జిల్లా పులివెందులలో భారీ అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏసీబీ అధికారులు సీఐ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.
రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కి బాబును పోలీసులు ఇవాళ(ఆదివారం) అరెస్టు చేశారు. డిక్కీ బాబు నుంచి ఐదు రాగి చెంబులు, రూ.1,10,000 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఫార్చునర్ వాహనాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో.. సిట్ పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో వాసుదేవ రెడ్డిదే కీలకపాత్ర అని నిర్దారించింది..
సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారని, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.