Home » AP Police
ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
ఏపీ హైకోర్టు అడ్వకేట్ను కిడ్నాప్ చేసి హింసించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2023 నవంబర్ 7వ తేదీన హైకోర్టు అడ్వకేట్ని నిర్భంధించి హింసించినట్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కర్నాటి వీరభద్రరావు, కర్నాటి సతీశ్లపై ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది.
విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం చీమలపల్లిలో ప్రభుత్వ భూములపై అక్రమంగా నిర్మించిన పాకలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. చీమలపల్లిలోని సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన సుమారు 400 పాకలను అధికారులు తొలగించారు.
విజయవాడ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలోని ఎలైట్ ఫోర్సెస్ అయిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోలు జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటుకున్నారు. హర్యానా రాష్ట్రం మనేసర్లోని క్యాంపస్లో నిర్వహించిన 16వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో ఏపీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు సమీపంలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటవీ సంపద కళ్లముందే కాలిపోయింది.
మండలకేంద్రంలో గంజాయి సిగరెట్ రూ.250కి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యువతను టార్గెట్గా చేసుకొని గంజా సిగరెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని తాగిన యువకులు మత్తులో తూలుతున్నారు.