Home » AP News
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ కోసం అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నాడు అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన మంత్రి లోకేశ్.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీని తమ బాధ్యతగా భావించామని..
రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.
భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి ఏరో ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR-1, ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.
రెవెన్యూ శాఖలో భూ బకాసురులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే కబ్జాలు చేస్తున్నారు.
తుంగభద్ర నదీతీరాన వెలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్షేత్రం భక్తి పారవశ్యంతో పరవశించిపోయింది.
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్న ఓర్వకల్లు ప్రాంతంలో భూములను పరిశీలించేందుకు ఈ నెల 18న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజెరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ రానున్నట్లు తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు.