Home » AP News
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత దాదాపు నాలుగేళ్ళ తరువాత ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..
రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అవగాహన లేదని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. అమరావతికి వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో మదుసూధన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ కేసును మూసి వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విశాఖ సమ్మిట్ ద్వారా 50వేల ఉద్యోగాలు వస్తాయని భావించామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లిబర్డ్ ఇన్సెంటివ్లు కూడా ఇస్తున్నామని తెలిపారు.
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డివి మాటల్లో కోతలు తప్పా... చేతల్లో అభివృద్ధి ఎక్కడా చూపించలేని దద్దమ్మ.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే లేపాయి.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి అన్నారు. ఆయన మాడియాతో మాట్లాడుతూ... పేర్నినాని లాంటి వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఆయన అన్నారు.
సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో.. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై ఆగుతుంది. జనవరి 2వ తేదీ నుంచి రెండు నిమిషాలపాటు ఈ స్టేషన్లో నిలుపుతారు. ఈ మేరకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రైలుకు ఇక్కడ స్టాపింగ్ కల్పాంచడం పట్ల ఈ ఏరాయా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రతిపాదన..